Vande bharat express: కాచిగూడ- యశ్వంత్పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్పూర్, విజయవాడ- చెన్నై వందేభారత్ రైళ్లు సెప్టెంబర్ 24న ప్రారంభం కానున్నాయి. వీటి టికెట్ ధరలు ఖరారయ్యాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ఒకేసారి ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్పూర్ (KACHEGUDA- YESVANTPUR JN), చెన్నై - విజయవాడ (CHENNAI- VIJAYAWADA) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లలో మెరుగైన సదుపాయాలతో వస్తున్న ఈ రైళ్లు ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నాయి. తాజాగా వీటి టికెట్ ధరలు వెల్లడయ్యాయి.
కాచిగూడ To యశ్వంత్పూర్ ₹1600
కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ (20703) మధ్య బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 05:30 గంటలకు రైలు కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్ (బెంగళూరు) జంక్షన్ చేరుకుంటుంది. 610 కిలోమీటర్ల దూరానికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో మహబూబ్నగర్ (6.49), కర్నూలు సిటీ (8.24), అనంతపురం (10.44), ధర్మవరం జంక్షన్ (11.14) స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కు ఛైర్కార్ టికెట్ ధర రూ.1600గా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ ధర రూ.2915గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్ ఛార్జీలు అంతర్భాగంగా ఉంటాయి.
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20704) మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంతపూర్లో బయల్దేరుతుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్కు చేరుకుంటుంది. ధర్మవరం జంక్షన్ (4.59), అనంతపురం (5.29), కర్నూలు సిటీ (7.50) మహబూబ్నగర్ (9.34) స్టేషన్లలో నిమిషం చొప్పున ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ఛైర్కార్ టికెట్ ధర రూ.1540 గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2865గానూ రైల్వే శాఖ నిర్ణయించింది. కేటరింగ్ ఛార్జీల్లో వ్యత్యాసమే ఇందుక్కారణం.
ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
ఆరున్నర గంటల్లో విజయవాడ- చెన్నై
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీ రూట్లలో ఒకటైన చెన్నై- విజయవాడ (20677) మధ్య ఇంకో వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ రైలు 517 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6.40 గంటల్లో చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రేణిగుంట (7.05), నెల్లూరు (8.39), ఒంగోలు (10.09), తెనాలి (11.21) స్టేషన్లలో ఆగుతుంది. ఛైర్కార్లో రూ.1320, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరను రూ.2540గా రైల్వే శాఖ నిర్ణయించింది.
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20678) మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడ నుంచి చెన్నై బయల్దేరుతుంది. రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఛైర్ టికెట్ ధర రూ.1420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2630గా నిర్ణయించారు. ఇరువైపులా నిర్దేశిత స్టేషన్లలో ఒక్కో నిమిషం మాత్రమే రైలు ఆగుతుంది. ఒక్క రేణిగుంటలో మాత్రమే 5 నిమిషాల స్టాపును నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన