Viveka Murder Case: వివేకా హత్యకేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారినట్లు కడప సబ్కోర్టులో దస్తగిరి పేరిట సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు సూచన మేరకు దస్తగిరి వాంగ్మూల పత్రాలను సీబీఐ న్యాయవాదులకు ఇచ్చింది. నేర అంగీకార పత్రాల్లో దస్తగిరి పలు ఆసక్తికర వివరాలన...
కడప: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారినట్టు కడప సబ్ కోర్టులో దస్తగిరి పేరిట సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు సూచన మేరకు దస్తగిరి వాంగ్మూల పత్రాలను సీబీఐ న్యాయవాదులకు ఇచ్చింది. నేర అంగీకార పత్రాల్లో దస్తగిరి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించాడు.
‘‘వివేకా హత్యలో సునీల్, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, నేను పాల్గొన్నాం. ఆర్థిక లావాదేవీలతోనే హత్య జరిగింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. ఎర్రగంగిరెడ్డి మోసం వల్లే ఓడిపోయానని వివేకాకు ఆగ్రహం. బెంగళూరు స్థలంపై పంచాయితీకి పలుమార్లు వివేకా వెళ్లేవారు. స్థలంలో ఎర్రగంగిరెడ్డి వాటా అడిగితే వివేకా ఆగ్రహించారు. 2018లో నేను వివేకా వద్ద పని మానేశాను. ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్ను కలిసేవాడిని. 2019 ఫిబ్రవరి 2న సునీల్ యాదవ్ను, ఉమాశంకర్రెడ్డిని, నన్ను, ఎర్రగంగిరెడ్డి తన ఇంటికి తీసుకెళ్లారు. వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి నాకు సూచించారు. వివేకాను హత్య చేయలేనని చెప్పా. హత్య చేసేందుకు తామూ వస్తామన్నారు. వివేకా హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందన్నారు. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారన్నాడు. శంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ.5కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.
ఇలా జరిగిన 4 రోజులకు సునీల్ యాదవ్ నాకు రూ.కోటి ఇచ్చాడు. రూ.25 లక్షలు తనకివ్వాలని.. తర్వాత ఇస్తానని సునీల్ చెప్పాడు. రూ.75 లక్షలు మున్నా అనే వ్యక్తి వద్ద దాచి ఉంచా. సునీల్, ఉమాశంకర్.. వివేకా ఇంటికుక్కను కారుతో ఢీకొట్టి చంపారు.నేను కదిరి వెళ్లి గొడ్డలి కొని సునీల్ యాదవ్కు ఇచ్చా. మార్చి 14న ఎర్రగంగిరెడ్డి,సునీల్,ఉమాశంకర్,నేను వివేకా ఇంటికి వెళ్లాం. ముందుగా ఎర్రగంగిరెడ్డి వివేకా ఇంట్లోకి వెళ్లాడు. తర్వాత మేం ముగ్గురం గోడదూకి లోపలికి వెళ్లాం. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్రగంగిరెడ్డి వాటా అడిగారు. వాగ్వాదం జరిగి సునీల్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాపై ఉమాశంకర్రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో లేఖ రాయించాం. సునీల్, ఉమాశంకర్.. వివేకా ఇంట్లో కొన్ని పత్రాలు తీసుకున్నారు. ఆ తర్వాత స్నానాల గదిలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి చంపారు. వివేకాను హత్యచేశాక అందరం గోడదూకి పారిపోయాం’’ అని సెక్షన్ 164 స్టేట్మెంట్లో దస్తగిరి వివరాలు వెల్లడించాడు. ఆగస్టు 30న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?