Thirumala: తిరుమలలో మరోసారి ఏనుగుల కలకలం

తిరుమలలో భక్తులను మరోసారి ఏనుగులు ఆందోళనకు గురిచేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు సమీపంలోని ఎలిఫెంట్‌ ఆర్చ్‌ వద్ద అటవీ

Updated : 26 Jun 2022 19:55 IST

తిరుమల: తిరుమల భక్తులను ఏనుగులు మరోసారి ఆందోళనకు గురిచేశాయి. మొదటి ఘాట్ రోడ్డు సమీపంలోని ఎలిఫెంట్‌ ఆర్చ్‌ వద్ద అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 7 ఏనుగులు ఘాట్‌రోడ్డు సమీపంలోకి రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న తితిదే అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఏనుగుల గుంపు ఘాట్‌ రోడ్డు సమీపంలోకి రావడం వారంలో ఇది రెండోసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని