బీరుట్ పేలుళ్లు: కస్టమ్స్ ఉన్నతాధికారి అరెస్టు
లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆగస్టు 4న..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆగస్టు 4న నౌకాశ్రయంలో జరిగిన పేలుళ్ల కారణంగా 10 నుంచి 15 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 180 మంది మృతిచెందగా 6 వేల మంది గాయపడ్డారు. 30 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ కస్టమ్స్ ఉన్నతాధికారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. 3 వేల టన్నుల పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ ఎక్కడినుంచి వచ్చింది, దానిని నౌకాశ్రయంలో ఉంచడానికి గల కారణాలను విచారిస్తోంది.
పేలుళ్ల అనంతరం లభించిన కొన్ని పత్రాల ఆధారంగా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కొన్ని సంవత్సరాలుగా నౌకాశ్రయంలోనే నిలువచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులందరికీ తెలుసుననీ, కానీ ఆ పేలుడు పదార్థాలను ఇన్ని సంవత్సరాలుగా పోర్టులోనే ఉంచడానికి గల కారణాలను జడ్జి ఫాది స్వాన్ కస్టమ్స్ అధికారి బాద్రి దాహెర్ను ప్రశ్నించారు. పలు విషయాలపై ఇద్దరు లాయర్ల సమక్షంలో సోమవారం దాహెర్ను జడ్జి 4.30 గంటలపాటు విచారించారు. విచారణ ముగిసేంతవరకు దాహెర్ అధికారుల అదుపులోనే ఉండనున్నారు. ఈ విచారణపై లెబనాన్ అధ్యక్షుడు స్పందించారు. వినాశకరమైన పేలుళ్లపై దర్యాప్తు అత్యంత క్లిష్టతరంగా ఉంటుందని.. ఈ దర్యాప్తు అంత త్వరగా పూర్తయ్యే అంశం కాదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.