పెళ్లికి నిరాకరించిందని గంజాయి కేసు కుట్ర

తనతో పెళ్లికి ఆమె నిరాకరించిందనే అక్కసుతో గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు

Updated : 28 Jun 2021 11:34 IST

తిరువనంతపురం: తనతో పెళ్లికి ఆమె నిరాకరించిందనే అక్కసుతో గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. మాదకద్రవ్యాల అక్రమ నిల్వల కేసులో చివరకు అరెస్ట్‌ కూడా చేయించాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆ యువతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్‌కు తిరువనంతపురంలోని లార్డ్స్‌ ఆసుపత్రి సీఈవో హరీశ్‌ హరిదాస్‌తో పరిచయం ఉంది. ఈ చనువుతో హరీశ్‌ పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె నిరాకరించి అతణ్ని దూరంగా పెట్టారు. శోభపై కోపం పెంచుకున్న హరీశ్‌.. ఆమె దగ్గర పనిచేసే వివేక్‌రాజ్‌ సాయంతో ఇంటి లోపల గంజాయి పెట్టించాడు. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. వీరి దర్యాప్తులో శోభా విశ్వనాథ్‌ను నిర్దోషిగా తేల్చారు. ఈ సందర్భంగా ‘ఈటీవీ’తో ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే ఇలాంటి అన్యాయాలపైన పోరాడతా. చాలామంది ఫోన్లు చేసి వారికి జరిగిన అన్యాయాల గురించి చెబుతున్నారు’ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని