2035 నాటికి ప్రజారోగ్యంపై పూర్తి నిఘా
భవిష్యత్తులో మహమ్మారులు మానవాళిని మరింత వేగంగా చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున తొలిదశలోనే పసిగట్టేలా దేశంలో పటిష్ఠమైన ప్రజారోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది.........
దార్శనిక పత్రం విడుదల చేసిన నీతి ఆయోగ్
దిల్లీ: భవిష్యత్తులో మహమ్మారులు మానవాళిని మరింత వేగంగా చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున తొలిదశలోనే పసిగట్టేలా దేశంలో పటిష్ఠమైన ప్రజారోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై కెనడాలోని మానిటోబా యూనివర్సిటీతో కలిసి రూపొందించిన 2035 దార్శనిక పత్రాన్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ సోమవారం విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం దేశంలో ఉన్న మూడంచెల ఆరోగ్య వ్యవస్థతో పాటు, సామాజిక నిఘాను బలోపేతం చేయాలి. వైద్యఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించాలి. దీంతోపాటు రెఫరల్ నెట్వర్క్ను విస్తరించాలి. ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచాలి. రోగుల వ్యక్తిగత ఎలక్ట్రానిక్ హెల్త్రికార్డులపై నిఘా ఉంచి దేశంలో జరుగుతున్న ఆరోగ్య పరిణామాలను గుర్తించాలి. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య సర్వేలు నిర్వహించాలి.
రోగాల రూపాంతరాలపై ప్రత్యేక అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. సరికొత్త డేటా పంపిణీ విధానం ఉండాలి. ఇప్పటిలా సంప్రదాయబద్ధమైన డేటా ఎంట్రీపై ఆధారపడకుండా నూతన ఎనలిటిక్స్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, డేటాసైన్స్తో పాటు మరిన్ని వినూత్న విధానాలు అవలంబించాలి. దీనివల్ల ప్రజారోగ్య నిఘాలో భారత్ ప్రపంచస్థాయి నాయకత్వం వహించే అవకాశం ఉంది’’ అని నీతిఆయోగ్ పేర్కొంది.
ఏపీలో అమలవుతున్న సీడ్ గురించి ప్రస్తావన..
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సిస్టమ్ ఫర్ ఎర్లీ వార్నింగ్ బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ డేటా(సీడ్) గురించి ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టును జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ), జర్మనీకి చెందిన జియోమెడ్ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తూ ప్రాథమిక స్థాయిలో కనిపించే రోగ లక్షణాలపై నిఘా ఉంచినట్లు పేర్కొంది. డేటాబేస్, అల్గారిథమ్, జీఐఎస్ టూల్స్ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారని, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టం తనకు అవసరమైన సమాచారాన్ని హైదరాబాద్లోని స్టేట్ డిస్పాచ్ సెంటర్ ద్వారా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకొని రాబోయే రోగాల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుందని నీతి ఆయోగ్ వివరించింది. ఈ ఎమర్జెన్సీ సిస్టం 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే డేటాను క్యాప్చర్ చేస్తున్నట్లు చెప్పింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
Manipur: మణిపుర్లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులతో విరుచుకుపడ్డారు. -
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.