93.69శాతం మంది కోలుకున్నారు!

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 10,75,326 పరీక్షలు జరపగా.. కొత్తగా 45,209 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో 85,21,617 మంది కోలుకున్నారు......

Published : 22 Nov 2020 10:00 IST

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 10,75,326 పరీక్షలు జరపగా.. కొత్తగా 45,209 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో 85,21,617 మంది కోలుకున్నారు. మరో 4,40,962 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 4.85 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 93.69శాతానికి పెరిగింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 13,17,33,134 నమూనాల్ని పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

కొత్తగా మహమ్మారి బారిన పడి 501 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,33,227కి ఎగబాకింది. ప్రస్తుతం మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో 17.74 లక్షల కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే అక్కడ 5,760 కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న దిల్లీలో గత 24 గంటల్లో 5,879 కేసులు వెలుగుచూశాయి. కొత్తగా మరో 100 మంది మరణించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొత్తగా మరో 400 ఐసీయూ పడకల్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని