ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

 భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లకు చేరింది.  ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది...

Published : 23 Aug 2020 11:58 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ 

 

న్యూదిల్లీ :  భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను 2020 చివరి నాటికి సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్‌‌ శనివారం తెలిపారు. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్లలో ఒకటి క్లినికల్‌ ట్రయల్స్‌లో మూడో దశలో ఉందన్నారు. మేం ఎంతో నమ్మకంగా ఉన్నాం.. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తాము’ అని పేర్కొన్నారు. 
భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,044,940కు చేరింది. శనివారం ఒక్కరోజే 68,898 కేసులు నమోదవ్వగా.. 983 మంది మృతి చెందారు. 22.71 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని