అత్యవసర వినియోగ అనుమతికి మరో టీకా!
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది.
దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మోడెర్నా
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది. ఇప్పటికే తాము రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫైజర్-బయోఎన్టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా, రష్యా దేశాల వ్యాక్సిన్లు మినహా, అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న రెండో వ్యాక్సిన్గా మోడెర్నా టీకా నిలిచింది.
మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 94శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అయితే, తొలి మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో భాగంగా కేవలం 95 కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. కానీ, ప్రస్తుతం 196 కేసులను విశ్లేషించిన అనంతరం వ్యాక్సిన్ సమర్థతను మరోసారి ప్రకటించింది. తాజా విశ్లేషణలో 185 మంది ప్లెసిబో తీసుకున్నవారు కాగా 11మంది మాత్రమే నిజమైన వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలోనూ వ్యాక్సిన్ 94.1శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు మోడెర్నా వెల్లడించింది. సురక్షిత, సమర్థతపై పూర్తి నమ్మకంతో ఉన్న మోడెర్నా, వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించినట్లు స్పష్టంచేసింది. ఇవి సాధారణంగా కనిపించేవేనని వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. అందుకే అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా, యూరోపియన్ నియంత్రణ సంస్థలకు నివేదిస్తున్నట్లు మోడెర్నా ప్రకటించింది.
డిసెంబర్ పదో తేదీపై ఉత్కంఠ...
కరోనా వ్యాక్సిన్ సంస్థలు అనుమతి కోసం తమను సంప్రదిస్తోన్న నేపథ్యంలో, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఎఫ్డీఏ సిద్ధమైంది. ఈ నెలలోనే వ్యాక్సిన్ సమర్థతపై శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక సమీక్ష జరపనుంది. ఫైజర్ ఇప్పటికే అనుమతి కోరగా, డిసెంబర్ 10వ తేదీన నిపుణుల బృందం ముందుకు ఫైజర్ సమాచారం రానుంది. అప్పటినుంచి మరో వారంరోజుల అనంతరం (డిసెంబర్ 17వ తేదీన) మోడెర్నా వ్యాక్సిన్ సమర్థతపై శాస్త్రవేత్తల బృందం చర్చించనుంది. అయితే, ఇవి పూర్తైన తర్వాత కొన్ని రోజుల్లోనే అనుమతిపై ఎఫ్డీఏ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక నియంత్రణ సంస్థల అనుమతి అభించిన వెంటనే వ్యాక్సిన్ పంపిణీకి అటు ఫైజర్, మోడెర్నా సంస్థలు సిద్ధమవుతున్నాయి.
ఇదిలాఉంటే, క్లినికల్ ట్రయల్స్లో భాగంగా మోడెర్నా 30వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు చేపట్టింది. కేవలం 18 ఏళ్ల పైబడిన వారిలోనే ప్రయోగాలు జరిపింది. వీరిలో దాదాపు 7వేల మంది 65ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారే. అయితే, వృద్ధుల్లోనూ వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది. వీరిలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా ఉండటం గమనార్హం. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి..
వృద్ధుల్లోనూ మెరుగైన ఫలితాలు!
టీకా నిల్వ: ఆ సమస్య ఉండదన్న మోడెర్నా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.