ఎర్రకోటలో గణతంత్ర వేడుకలు లేనట్లేనా?
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది
కరోనా ఎఫెక్ట్తో పలు మార్పులు
దిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. వీక్షకుల సంఖ్యను తగ్గించడం.. మాస్క్లు, భౌతికదూరం తప్పనిసరి చేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటకు దూరంగా వేడుకలను నిర్వహంచనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
సాధారణంగా ఏటా గణతంత్ర వేడుకల పరేడ్ ఎర్రకోటలో ముగుస్తుంది. అయితే, ఈసారి కరోనా దృష్ట్యా పరేడ్ను విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరేడ్ దూరాన్ని 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించనున్నారట. ఇక పరేడ్లో పాల్గొనేవారి సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు ఒక్కో బృందానికి 144 మంది సభ్యులుండగా.. ఈసారి దాన్ని 96కు కుదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విన్యాసాల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక గణతంత్ర వేడుకల్లో వీక్షకుల సంఖ్యను కూడా భారీగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు లక్ష మందికి పైగా వీక్షకులను అనుమతించగా.. ఈసారి 25వేలకు పరిమితం చేస్తారని తెలుస్తోంది. 15ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఇవ్వట్లేదని, సాంస్కృతి కార్యక్రమాల సంఖ్యను కూడా కుదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా.. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు ఇటీవల కేంద్ర విదేశాంగశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యూకేలో కరోనా కొత్తరకం విజృంభించడంతో పాటు భారత్లోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి