ఎర్రకోటలో గణతంత్ర వేడుకలు లేనట్లేనా?
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది
కరోనా ఎఫెక్ట్తో పలు మార్పులు
దిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. వీక్షకుల సంఖ్యను తగ్గించడం.. మాస్క్లు, భౌతికదూరం తప్పనిసరి చేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటకు దూరంగా వేడుకలను నిర్వహంచనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
సాధారణంగా ఏటా గణతంత్ర వేడుకల పరేడ్ ఎర్రకోటలో ముగుస్తుంది. అయితే, ఈసారి కరోనా దృష్ట్యా పరేడ్ను విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరేడ్ దూరాన్ని 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించనున్నారట. ఇక పరేడ్లో పాల్గొనేవారి సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు ఒక్కో బృందానికి 144 మంది సభ్యులుండగా.. ఈసారి దాన్ని 96కు కుదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విన్యాసాల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక గణతంత్ర వేడుకల్లో వీక్షకుల సంఖ్యను కూడా భారీగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు లక్ష మందికి పైగా వీక్షకులను అనుమతించగా.. ఈసారి 25వేలకు పరిమితం చేస్తారని తెలుస్తోంది. 15ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఇవ్వట్లేదని, సాంస్కృతి కార్యక్రమాల సంఖ్యను కూడా కుదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా.. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు ఇటీవల కేంద్ర విదేశాంగశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యూకేలో కరోనా కొత్తరకం విజృంభించడంతో పాటు భారత్లోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
తమకు పిల్లలు లేరని, తమ తపనంతా భవిష్యత్తు తరాల చిన్నారుల కోసమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఎన్నికల వేళ.. అయోధ్య రామయ్యను దర్శించుకున్న మోదీ (వీడియో)
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ మరోసారి రామమందిరాన్ని సందర్శించారు. -
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
ఎన్నికల ప్రచార క్రమంలో రాహుల్ గాంధీ కొన్ని సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎప్పుడు తెలుపు రంగు టీ-షర్ట్ ఎందుకు ధరిస్తారు? అనేదానికి బదులిచ్చారు. -
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
ప్రజ్వల్ రేవణ్ణ స్వదేశానికి తీసుకొచ్చేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు. -
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎన్టీఏ కొట్టిపారేసింది. -
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..