15 మందిలో ఒకరికి కరోనా: ఐసీఎంఆర్
భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే నివేదికలోని కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరు(పదేళ్ల పైన ఉన్నవారు) కరోనా బారిన పడినట్లు సర్వే నివేదిక అంచనా వేసినట్లు తెలిపింది.
దిల్లీ: భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే నివేదికలోని కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరు(పదేళ్ల పైన ఉన్నవారు) కరోనా బారిన పడినట్లు సర్వే నివేదిక అంచనా వేసినట్లు తెలిపింది. దాదాపు 29వేల మందిపై సర్వే నిర్వహించగా 6.6శాతం మంది గతంలో కరోనా బారిన పడినట్లు తేలిందని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
భార్గవ మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నగరాల్లోని మురికివాడలు, సహా ఇతర ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక నగరాల్లోని ధనిక ప్రాంతాలతో పోల్చుకుంటే మురికివాడల్లో కేసుల తీవ్రత రెండు రెట్లు ఎక్కువగా ఉంది. వయోజనుల్లో 7.1శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు సెరో సర్వే అంచనా వేస్తోంది. మే నెలలో కన్నా ఆగస్టులో కేసుల సంఖ్య తగ్గింది. దీన్ని బట్టి పరీక్షలు, డిటెక్షన్ల సంఖ్య పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది’ అని ఆయన వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో పండగలు, శీతాకాలం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కంటైన్మెంట్ పద్ధతుల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశంలో రికవరీ కేసుల సంఖ్య 51లక్షలు దాటింది. ప్రపంచంలోనే రికవరీల్లో ఇది అత్యధికం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యల్పంగా దేశంలో మిలియన్ జనాభాకు 4వేల మంది కరోనా బారిన పడుతుండగా.. 70 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా మిలియన్ జనాభాకు దాదాపు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 2.97 కోట్ల టెస్టులు చేశాం. ఆగస్టు 3 నుంచి ఇప్పటివరకు కరోనా మరణాలు గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా మరణాల సంఖ్య 96వేలు దాటింది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక