విదా, సోఫీ సేవలు అమోఘం: మోదీ
దేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ‘ కమెండేషన్ కార్డ్స్’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్కీ బాత్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని...
దిల్లీ: దేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ‘ కమెండేషన్ కార్డ్స్’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్కీ బాత్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని తెచ్చుకునే వారు దేశీయ జాతి శునకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అసలు విదా, సోఫీల పేరునే ప్రధాని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో తెలుసా?
‘విదా’ లాబ్రడార్ జాతికి చెందిన జాగిలం. ఉత్తర కమాండ్ ఆర్మీలో సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 5 మందు పాతరలను, ఒక గ్రనేడ్ను కనిపెట్టి, రక్షణ సిబ్బందికి ఎలాంటి ఆపద కలగకుండా చేసింది. మరో జాగిలం సోఫీ బాంబు నిర్వీర్య బృందంలో కీలకంగా సేవలందించింది. అంతేకాకుండా బాంబులను గుర్తించడంలో దిట్ట. పలుమార్లు బాంబులను గుర్తించి ఎన్నో ప్రాణాలను రక్షించింది. ఈ రెండు శునకాల పనితనంతో భద్రతా సిబ్బంది ఇవి ఎంతగా సహకరిస్తున్నాయో మరోసారి నిరూపితమైందని మోదీ చెప్పారు.
ఆర్మీలో డాగ్ యూనిట్ను ‘ది సైలంట్ వారియర్స్’ అని పిలుస్తారు. సైలంట్ వారియర్స్ పని తీరును మరింత మెరుగు పరిచేందుకు రక్షణశాఖ గత డిసెంబర్లో కొన్ని మార్పులు చేసింది. వాటి కోసం ప్రత్యేకంగా ఆడియో-వీడియో నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసింది. జాగిలాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు వీటిని అమర్చుతారు. తద్వారా దాదాపు కిలోమీటరు దూరంలోని శత్రువులను కూడా గుర్తించి సిబ్బందికి సమాచారం అందించే వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.