మోదీ: ఒకేరోజు 3నగరాల్లో టీకా కేంద్రాల పరిశీలన!
దేశంలో ఉత్పత్తి అవుతోన్న కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిద్ధమయ్యారు.
దిల్లీ: దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. దేశంలోని మూడు ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లోని వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను శనివారం ఒకేరోజు మోదీ సందర్శించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పర్యటనలో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను ప్రధాని మోదీ అక్కడి నిపుణులతో కలిసి సమీక్షిస్తారు. వ్యాక్సిన్ తయరీ కేంద్రాలను పరిశీలించడమే కాకుండా, టీకా పంపిణీకి ఎదురయ్యే సవాళ్ల గురించి అక్కడి శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించే అవకాశం ఉంది. తద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేయడంలో తాజా పర్యటన దోహదపడుతుందని ప్రధాని కార్యాలయం అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా తుదిదశ ప్రయోగాలు పూర్తిచేరుకుంటున్న కరోనా వ్యాక్సిన్, వినియోగానికి కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారత్లోనూ వ్యాక్సిన్ ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇక మనదేశంతో పాటు వివిధ దేశాల్లో కోట్ల మందికి కావాల్సిన వ్యాక్సిన్ అందించేందుకు భారత్లోనే భారీస్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకోసం స్పుత్నిక్-వి, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వంటి వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు భారత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించి పురోగతిపై సమీక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.