రష్యా విపక్షనేతపై విష ప్రయోగం?
రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
కోమాలో రష్యా అవినీతి వ్యతిరేక ఉద్యమనేత అలెక్సే నావల్నీ
మాస్కో: రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సైబీరియా నుంచి మాస్కోకు తిరిగి వస్తున్న సమయంలో విమానంలోనే అలెక్సే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని ఓమ్స్క్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన అనంతరం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నావల్నీ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు అతని మీడియా కార్యదర్శి కిరా యార్మిష్ ట్విటర్లో వెల్లడించారు.
‘అలెక్సే నావల్నీకు తేనీరులో విషం కలిపినట్లు అనుమానిస్తున్నాం. ఉదయం నుంచి అతను అదొక్కటే సేవించారు. వేడి పదార్థంతో విషం శరీరంలోకి వెళ్లడంతో అది మరింత తొందరగా ప్రభావం చూపిందని వైద్యులు పేర్కొన్నారు’ అని మీడియా కార్యదర్శి కిరా యార్మిష్ పేర్కొన్నారు. అలెక్సేపై గతంలోనూ ఇది తరహా విషప్రయోగం జరిగినట్లు యార్మిష్ గుర్తుచేశారు. యాంటీ కరప్షన్ ఫౌండేషన్తోపాటు ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’ పార్టీ నేతగా ఉన్న నావల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెడుతున్నారు. వీటితోపాటు పుతిన్కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయన గతంలో అధ్యక్షుడిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో అతడు పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే అతనిపై పెట్టిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా అలెక్సేపై పలుసార్లు భౌతిక దాడులు కూడా జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి