‘1962 తరవాత ఇదే తీవ్రమైనది’:జై శంకర్
కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి
దిల్లీ: కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి’ అని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ‘ద ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్ సర్టైన్ వరల్డ్’ పుస్తకం విడుదల కానున్న తరుణంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సరిహద్దుల వద్ద పరిస్థితి తీవ్రతను తెలియజేశారు.
‘1962 తరవాత ఇది కచ్చితంగా అత్యంత తీవ్రమైన పరిస్థితి. వాస్తవంగా చూస్తే..45 సంవత్సరాల తరవాత సరిహద్దు వద్ద సైనికులు మరణించడం ఇదే తొలిసారి. అలాగే వాస్తవాధీన రేఖ వద్ద ఇరువైపుల మోహరించిన బలగాల సంఖ్య కూడా చాలా ఎక్కువ’ అని వెల్లడించారు. అంతేకాకుండా పొరుగుదేశాల మధ్యసంబంధాలు ఒడుదొడుకులు లేకుండా కొనసాగాలంటే సరిహద్దుల వద్ద శాంతే కీలకమన్న విషయాన్ని చైనాకు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. సైనిక, దౌత్య అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, గత కొద్ది నెలలుగా తూర్పు లద్దాఖ్ ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. గతంలో రెండు దేశాల మధ్య దెప్సాంగ్, చుమార్, డోక్లాం వంటి సరిహద్దు వివాదాలు నెలకొన్నాయని.. కానీ, అవి చర్చలతో ముగిసిపోయాయని గుర్తు చేశారు. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చకుండా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ ప్రస్తుత పరిస్థితికి పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.