ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్కు దరఖాస్తు
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ వ్యాక్సిన్పైనే ఆశలు పెట్టుకున్నాయి.........
దిల్లీ: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ వ్యాక్సిన్పైనే ఆశలు పెట్టుకున్నాయి. దానికోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్షీల్డ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ రెండు, మూడు దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) డీసీజీఐ అనుమతి కోరింది. ఈ మేరకు పుణెకు చెందిన ఎస్ఐఐ కొవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్కు అనుమతి కోరుతూ డీసీజీఐకి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వాఖ వర్గాలు తెలిపాయి. భద్రత, రోగనిరోధక శక్తిని గుర్తించేందుకు వయోజనులపై అధ్యయనం చేయనుననట్టు ఎస్ఐఐ తన దరఖాస్తులో పేర్కొన్నట్టు సమాచారం.
ఈ ట్రయల్స్ కోసం 18 ఏళ్లు పైబడిన 1600 మంది ఎన్రోల్ చేసుకున్నట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ తొలి రెండు దశల ట్రయల్స్ బ్రిటన్లోని ఐదు ప్రాంతాల్లో నిర్వహించగా సత్ఫలితాలు ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్షీల్డ్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు ఎస్ఐఐ బ్రిటన్కు చెందిన ఫార్మా కంపెనీ అస్త్ర జెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో అందుబాటులోకి తేనున్న ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ను వచ్చే నెలలో జరపాలని భావిస్తున్నట్టు ఎస్ఐఐ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం