భారత్: ఒక్కరోజే 8లక్షల కొవిడ్ టెస్టులు!
భారత్లో నిన్న ఒక్కరోజే 8,30,391శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
రికార్డుస్థాయిలో ఒకేరోజు 56వేల మంది రికవరీ
70.77శాతానికి పెరిగిన రికవరీ రేటు, 1.96శాతం మరణాలు రేటు
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,30,391శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 2కోట్ల 68లక్షల(2,68,45,688) శాంపిళ్లకు పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 1433 కేంద్రాలకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. వీటిలో 947 ప్రభుత్వం ఆధీనంలోనివి కాగా మరో 486 కేంద్రాలు ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. జనవరి 23వరకు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్ల సంఖ్య 1433కు పెరిగింది. ప్రపంచంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 6కోట్లకు పైగా ప్రజలకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు.
ఒకేరోజు 56వేల మంది రికవరీ..
భారత్లో వైరస్ తీవత్ర కొనసాగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 56,383 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా బాధితుల రికవరీ రేటు 70.77శాతానికి పెరగ్గా మరణాల రేటు 1.96శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 23లక్షల మందికి వైరస్ సోకగా వీరిలో 17లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 27.27శాతం కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనే రోజువారీ పాజిటివ్ కేసులు అధికంగా ఉంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం