సుశాంత్ మృతిని మర్చిపోం: దేవేంద్ర ఫడణవీస్
బిహార్లో ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీలు పకడ్బందీగా..
పాట్న: బిహార్లో ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాగా భాజపా నేతలు రాష్ట్రంలో సుశాంత్సింగ్ రాజ్పూత్ పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. నటుడి మృతిని రాజకీయం చేస్తూ, లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తోంది. కొద్ది రోజులుగా భాజపా తరఫున బిహార్లో ప్రచారం చేస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. సుశాంత్ మృతి ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, అతడికి న్యాయం జరిగేంతవరకూ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘సుశాంత్ మరణాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. సుశాంత్ మరణం కంటే ముందు నుంచే బిహార్లో పార్టీ కోసం పనిచేస్తున్నా. నటుడి మృతి సామాన్య ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. అతడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటాం. ఆ ఘనటను మేం మర్చిపోం. ఇంకెవ్వరినీ మర్చిపోనివ్వం’ అని అన్నారు.
సుశాంత్సింగ్ రాజ్పూత్ జూన్ 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)లు దర్యాప్తు చేస్తున్నాయి. కాగా నటుడికి మాదకద్రవ్యాలు సరఫరా చేశారంటూ నటి, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఆమె సోదరుడు షోవిక్తో పాటు పలువురిని అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.