AgustaWestland scam: వీవీఐపీ చాపర్ల కుంభకోణం.. రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై ఛార్జ్షీట్
దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ చాపర్ల కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేడు మరో సప్లమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది
దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ చాపర్ల కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం మరో సప్లమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మతో పాటు భారత వాయుసేనకు చెందిన నలుగురు మాజీ అధికారుల పేర్లను ఈ ఛార్జ్షీట్లో పేర్కొంది. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత సీబీఐ ఈ ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది.
శశికాంత్ శర్మ 2011-13 మధ్య రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 2013-17 వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా వ్యవహరించారు. శశికాంత్తో పాటు అప్పటి ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్, డిప్యూటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్ఏ కుంతే, అప్పటి వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టెన్ ఎన్ సంతోష్లపై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
వీవీఐపీ ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ కోసం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్ల్యాండ్తో చేసుకున్న ఒప్పందంలో పలువురికి భారీ ఎత్తున ముడుపులు దక్కాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఇది పెను దుమారం రేపింది. 1990ల్లో వీవీఐపీల ప్రయాణానికి ఏఐఎఫ్ సోవియెట్ కాలం నాటి ఎంఐ8లను వినియోగించేది. అయితే వీటికి బదులుగా కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని 1999లో ప్రతిపాదనలు చేశారు. సాధారణంగా వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ల ఆపరేషనల్ సీలింగ్ను 6వేల మీటర్లకు ఎయిర్ఫోర్స్ సెట్ చేసింది. అయితే ఎస్పీ త్యాగీ వాయుసేనాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సీలింగ్ను 4500 మీటర్లకు కుదించారు. దీంతో ఆగస్టా వెస్ట్ల్యాండ్ సంస్థ పోటీలోకి వచ్చేందుకు అవకాశం లభించినట్లయింది.
ఆగస్టా వెస్ట్ల్యాండ్ సంస్థే మధ్యవర్తులను ఉపయోగించి ఈ నిబంధనలను సడలించేలా చేసిందని, ఇందుకోసం త్యాగీ, ఆయన బంధువులకు భారీగా ముడుపులు అందాయని సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటికే త్యాగీ, మరో 11 మందిపై 2017లో సీబీఐ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2020 సెప్టెంబరులో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖెల్, మరికొందరిపై రెండో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..