Narendra Giri: ‘మహిళతో కలిసి ఉన్న ఫొటోను తయారుచేసి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు’
మహంత్ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.....
సూసైడ్నోట్లో విస్తుపోయే విషయాలు
ప్రయాగ్రాజ్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్రగిరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అతిథి గృహంలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో పలు విస్తుపోయే విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తన శిష్యుడు ఆనంద్ గిరి బ్లాక్మెయిల్ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నరేంద్రగిరి సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
‘ఆనంద్గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యా. సెప్టెంబర్ 13వ తేదీ రోజునే తనవు చాలించాలనుకున్నా. కానీ ధైర్యం సరిపోలేదు. కంప్యూటర్ సాయంతో.. ఓ మహిళతో నేను కలిసి ఉన్నట్లు చూపే ఫొటోను రూపొందించి నన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ఆనంద్గిరి సిద్ధమైనట్లు నాకు తెలిసింది. ఇది నన్ను కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఎంత గౌరవంగా జీవించాను. ఇలాంటి అపఖ్యాతితో జీవించలేను. అందుకే తనువు చాలిస్తున్నా’ అని నరేంద్రగిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్గిరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కారణమని నరేంద్రగిరి ఆ నోట్లో వెల్లడించినట్లు సమాచారం. ఆధ్య తివారితోటు అతడి కుమారుడు సందీప్ తివారి కూడా కారణమని అందులో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘నా మరణానికి కారణమైన వారిపై ప్రయాగ్రాజ్ పోలీసులు చర్యలు చేపట్టాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది’ అని నరేంద్రగిరి సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహంత్ నరేంద్రగిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని ప్రయాగ్రాజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కె.పి.సింగ్ తెలిపారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం