Anand Mahindra: రైల్వేలో ‘బేబీ బెర్తులు’.. మంత్రిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
భారతీయ రైల్వే ఇటీవలే ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారులు, పసిబిడ్డలతో ప్రయాణించే వారి సౌకర్యార్థం లఖ్నవూ మెయిల్ రైలులో ‘బేబీ బెర్తులు’ అమర్చింది.......
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే ఇటీవలే ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారులు, పసిబిడ్డలతో ప్రయాణించే వారి సౌకర్యార్థం లఖ్నవూ మెయిల్ రైలులో ‘బేబీ బెర్తులు’ అమర్చింది. దిగువన ఉండే ప్రధాన బెర్తుల్లో చిన్నారులు నిద్రించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసింది. ఈ తరహా ప్రాజెక్టు చేపట్టినందుకుగానూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభినందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
బేబీ బెర్తులకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వేలతో పోలిస్తే భారతీయ రైల్వేలు విభిన్నంగా ఉండాలని నేను ఎలాగైతే అనుకున్నానో ఇప్పుడు అలాగే చూస్తున్నా. మానవతా దృక్పథంతో చేసిన ఈ డిజైన్ అశ్విని వైష్ణవ్ విద్య, అనుభవానికి నిదర్శనం. ఇలాంటివి మీ నుంచి మరిన్ని ఆశిస్తున్నా. మెదడు, మనసు రెండింటిని కలిపి మీరు చేసిన ఈ ఆలోచన అద్భుతం’ అంటూ మహీంద్రా మెచ్చుకున్నారు. కాగా ఈ ట్వీట్కు రైల్వే మంత్రి స్పందించారు. ఈ తరహా ప్రాజెక్టులు మరిన్ని రానున్నట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణ ఇంతటితో ఆగలేదు. మంత్రి ట్వీట్కు మహీంద్రా ప్రతిస్పందిస్తూ.. మీరు చేపట్టే గొప్ప పనుల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ పేర్కొన్నారు.
ఇదీ ప్రాజెక్టు
రైలులోని లోయర్ బెర్తులో చిన్న పిల్లలు పడుకునేందుకు వీలుగా బేబీ బెర్తులను అటాచ్ చేస్తున్నారు. వినియోగంలో లేనప్పుడు వాటిని మడతపెట్టి సీటు వెనకాల అమర్చవచ్చు. ప్రస్తుతం లఖ్నవూ మెయిల్లోని ఏసీ-3 కోచ్లో 770 మి.మీ. పొడవు, 255 మి.మీ. వెడల్పు, 76.2 మి.మీ. ఎత్తుతో రెండు సీట్లకు ఈ బేబీ బెర్తులను అమర్చారు. ఈ ప్రాజెక్టుపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వీటిని రెండు సీట్లకే అమర్చామని, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయం అనంతరం తుది మెరుగులు దిద్ది మరిన్ని రైళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం బుకింగ్ను ప్రారంభిస్తామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం