Lakhimpur Kheri: లఖింపుర్ ఘటనలో మరో ఛార్జ్షీట్.. రైతులపైనా అభియోగాలు..!
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు గానూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. రైతులపై వాహనం దూసుకెళ్లడంతో ఆగ్రహం చెందిన రైతులు కారు డ్రైవర్, అందులోని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, కారు డ్రైవర్ మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్మీడియాలో వైరల్ అవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు జోక్యంతో లఖింపుర్ ఖేరీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఘటనపై దర్యాప్తు జరిపిన సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల 5000 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది.
ఇక రైతులపై దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక భాజపా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురు రైతులను అరెస్టు చేసి విచారించారు. ఈ రైతులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..