ఆహార ధాన్యాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం

పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మే, జూన్‌ నెలల్లో పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనుంది....

Published : 05 May 2021 18:35 IST

దిల్లీ: పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మే, జూన్‌ నెలల్లో పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనుంది. ఇందుకు మంత్రివర్గ ఆమోదం లభించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్న యోజన మూడో దశ కింద కేంద్రం ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 79.88 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్రం రూ.25,333 కోట్లను ఖర్చుచేయనుంది. 36,789 మెట్రిక్  టన్నుల బియ్యాన్ని.. 25,731 మెట్రిక్  టన్నుల గోధుమలను పంపిణీ చేయనుంది.

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ గత నెలలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇలాంటి వారు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతోనే ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని