Karnataka: జోడో యాత్రలో ‘పేసీఎం’ వివాదం.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ మండిపాటు!
కర్ణాటకలో కొనసాగుతోన్న కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’లో పేసీఎం టీషర్ట్ ధరించిన ఓ కార్యకర్తతో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్..
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో కొనసాగుతోన్న కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)’లో పేసీఎం(PayCM) టీషర్ట్ ధరించిన ఓ కార్యకర్తతో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. దీన్ని తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్.. పోలీసులు అతనితో బలవంతంగా టీషర్ట్ విప్పించి, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. వారికి ఈ అధికారం ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను శనివారం ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. ‘పార్టీ కార్యకర్తపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. టీషర్ట్ విప్పించి, అతనిపై దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? దాడి చేసినవారిని వెంటనే సస్పెండ్ చేయాలి' అని డిమాండ్ చేసింది.
మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ చేపడుతోన్న అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కొలేకే.. పోలీసులను ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు భాజపాపై మండిపడ్డారు. మరోవైపు.. పోలీసులు ఆ కార్యకర్తపై కేసు నమోదు చేయడం గమనార్హం. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పేర్కొంటూ ఇటీవల బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ పార్టీనే ఈ క్యాంపెయిన్ను నిర్వహిస్తోందని సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. బెంగళూరు పోలీసులు సైతం.. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?