Weight loss: 8 నెలల్లో 46 కిలోలు తగ్గి ‘స్లిమ్ కాప్’లా.. ఎలాగో చదవండి!
కేవలం 8 నెలల్లోనే 46కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు దిల్లీ డీసీపీ జితేంద్ర మణి. ఇందుకోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..
దిల్లీ: ఒకప్పుడు అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఓ పోలీస్ ఉన్నతాధికారి ఇప్పుడు స్లిమ్గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దిల్లీలో డీసీపీ(Delhi DCP)గా పనిచేస్తున్న జితేందర్ మణి(Jitendra Mani) కేవలం ఎనిమిది నెలల్లోనే 46కిలోల బరువు తగ్గి(Weight loss) స్లిమ్ కాప్లా మారిపోయారు. ఇందుకోసం ఆయన ఏ ఔషధాలు వాడారేమోనని అనుకుంటే మీరు పొరబడినట్టే. కేవలం కఠినమైన ఆహార నియమాలు, కసరత్తులతోనే ఇంతగా ఫిట్నెస్ సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో 130కిలోల బరువు ఉన్నప్పుడు జీతేంద్ర మణికి అనేక ఆరోగ్య సమస్యలు ఉండేవి. డయాబెటిస్, అధిక రక్తపోటు, కొవ్వు స్థాయిలు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ ముప్పు నుంచి బయటపడాలని దృఢ సంకల్పం తీసుకున్న ఆయన.. తన జీవన శైలినే పూర్తిగా మార్చేశారు. ఇందుకోసం రోజూ 15వేల స్టెప్పులు వాకింగ్ చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొనేవారు.
అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం, రోటీలు వంటి ఆహారం నుంచి సూప్లు, సలాడ్లు, పండ్లు వంటి అధిక పోషకాలు ఉండే ఆహారానికి మారారు. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్, కఠినమైన డైట్ పాటించడం ద్వారా కేవలం ఎనిమిది నెలల్లోనే నడుము పరిమాణం 12 ఇంచులు తగ్గించుకోవడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను ఐదో వంతు తగ్గించుకోగలిగారు.‘నేను మారాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రతి నెలలో 4.5లక్షల అడుగులు(స్టెప్స్) నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఎనిమిది నెలల్లో దాదాపు 32లక్షల స్టెప్పులు వాకింగ్ చేశా. ఇప్పుడు నా బరువు 84కిలోలకు తగ్గింది’’ అని డీసీపీ వివరించారు.
పోలీస్ ఉద్యోగంలో ఫిట్నెస్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దీంతో భారీ బరువు నుంచి ఫిట్నెస్ కాప్గా మారేందుకు జితేంద్ర మణి చేసిన కృషిని దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడా ప్రశంసించారు. 90వేల మందికి పైగా పోలీసు సిబ్బంది హాజరైన ఓ కార్యక్రమంలో పోలీస్ శాఖ తరఫున ఆయనకు ఓ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ జితేంద్ర మణి మాట్లాడుతూ.. తాను బరువు తగ్గేందుకు నిరంతరం చేసేలా తన పైఅధికారులు, సహోద్యోగులు ఎంతగానో సహకరించి ప్రోత్సాహం అందించారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి