కేంద్రానికి దిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసు
ఆక్సిజన్ సరఫరాపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందున ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్నిస్తూ కేంద్రానికి దిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసు జారీచేసింది.
ధిక్కరణ చర్యలు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్న
దిల్లీ: దేశరాజధాని దిల్లీకి అవసరమైన ఆక్సిజన్ను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన మెడికల్ ఆక్సిజన్ను అందించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా పాటించకపోవడం పట్ల న్యాయస్థానం అధికారులపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ సమయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్నిస్తూ.. కేంద్రానికి షోకాజ్ నోటీసు జారీచేసింది.
దిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. అక్కడి ఆసుపత్రులను మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న దిల్లీ హైకోర్టు.. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ ఒక్కరోజు కూడా రాష్ట్రానికి అందలేదనే విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చిందని పేర్కొంది. అలాంటప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసి ప్రయోజనమేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా దిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతుండడం పట్ల కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ హైకోర్టు, ఆక్సిజన్ సరఫరా చేయడంలో మీకంటే ఐఐటీ, ఐఐఎంలే మెరుగుగా పనిచేస్తాయని అభిప్రాయపడింది.
దిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై తీసుకుంటున్న చర్యలను కేంద్రప్రభుత్వం ఓ నివేదిక రూపంలో దిల్లీ హైకోర్టు ముందుంచింది. అయితే, నివేదికల ప్రకారం సరిపడ ఆక్సిజన్ ఉన్నప్పటికీ సరఫరాలో లోపం ఉన్నట్లు కోర్టు గుర్తించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కోర్టు.. ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదంటూ షోకాజు నోటీసు జారీచేసింది. అంతేకాకుండా దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర వద్ద ఉన్న ప్రణాళికను తెలియజేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.