covid vaccination: తగ్గిన వ్యాక్సినేషన్ వేగం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం తగ్గింది. కేంద్రం సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభించిన నాటితో (జూన్ 21) పోలిస్తే రోజువారీ సగటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం మందగించింది. జూన్ 21-27 మధ్య రోజుకు సగటు.....
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం తగ్గింది. కేంద్రం సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభించిన నాటితో (జూన్ 21) పోలిస్తే రోజువారీ సగటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం మందగించింది. జూన్ 21-27 మధ్య రోజుకు సగటున 61.14 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. జూన్ 28- జులై 4 మధ్య ఆ సగటు 41.92 లక్షలకు చేరింది. జులై 5-11 మధ్య కేవలం రోజుకు 34.32 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందించినట్లు కొవిన్ పోర్టల్లో ఉన్న డేటా వెల్లడిస్తోంది.
కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగం పుంజుకోగా.. మరికొన్ని చోట్ల తగ్గింది. హరియాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వేగం తగ్గింది. అదే సమయంలో కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, జమ్మూకశ్మీర్ తదితర చోట్ల వేగం కొంతమేర పెరిగింది. అయితే, సార్వత్రిక టీకా కార్యక్రమాని కంటే ముందు పరిస్థితితో పోల్చినప్పుడు మొత్తంగా వేగం పెరిగిందనే చెప్పాలి. దేశంలో ఇప్పటి వరకూ 37.73 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.