50 వేల ట్రాక్టర్లతో రైతన్నల ర్యాలీ!
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి రైతన్నలు సిద్ధమవుతున్నారు.
గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో ‘ట్రాక్టర్ పరేడ్’
దిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి రైతన్నలు సిద్ధమవుతున్నారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లపై దిల్లీకి చేరుకొని ‘ట్రాక్టర్ పరేడ్’తో తమ నిరసన తెలిపేందుకు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దిల్లీకి సమీప రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొనేందుకు రైతు సంఘాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వంతోనూ పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రతిష్టంభన తొలగలేదు. దీంతో గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీని చేపట్టాలని రైతులు సంకల్పించారు. ఇందుకు దిల్లీ పోలీసుల నుంచి కూడా అనుమతి రావడంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా రైతన్నలు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి దిల్లీ సరిహద్దుకు వేల ట్రాక్టర్లతో రైతులు చేరుకున్నారు. మంగళవారం నాటికి వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
వేల ట్రాక్టర్లతో ర్యాలీ..
రైతులు తలపెట్టిన ర్యాలీలో కేవలం హరియాణా నుంచే దాదాపు లక్ష ట్రాక్టర్లు పాల్గొంటాయని రైతు సంఘం నాయకులు వెల్లడిస్తున్నారు. ఇక పంజాబ్ నుంచి మరో 80వేల ట్రాక్టర్లతో రైతులు దిల్లీకి చేరుకునేందుకు సిద్ధమయినట్లు పేర్కొంటున్నారు. అయితే, రైతు సంఘాల నాయకులు చెబుతున్నప్పటికీ ఈ ర్యాలీలో దాదాపు 50వేలకు పైగా ట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సమీప రాష్ట్రాల రైతులు ట్రాక్టర్లపై బయలుదేరగా, రేపటి వరకు మరిన్ని ట్రాక్టర్లు దిల్లీ సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హరియాణాలోని రోహ్తక్ నుంచి దిల్లీ టిక్రీ వరకు ఉన్న దాదాపు 70కిలోమీటర్ల జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచీ..
అన్నదాతలు చేపట్టే ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ నుంచి దిల్లీ చేరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా భాజపా నుంచి బయటకు వచ్చిన మంజీందర్ సింగ్, తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు రైతులను ఏకం చేస్తున్నారు. ముఖ్యంగా గ్వాలియర్, అశోక్ నగర్, మోరేనా, శిప్పురి నుంచి దాదాపు పదివేల ట్రాక్టర్లతో దిల్లీ చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేవలం దిల్లీ సమీప రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్ ర్యాలీలు చేపడుతారని.. వీటి సంఖ్య లక్షల్లో ఉండనుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ వెల్లడించారు. కేవలం ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న రైతులు మాత్రమే ఈ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
200కి.మీ మేర పరేడ్..!
రైతులు ఆందోళన చేస్తోన్న దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపుర్ల నుంచి ట్రాక్టర్ ర్యాలీ బయలుదేరనుంది. ఈ మూడు సరిహద్దు మార్గాల్లో దాదాపు 200కి.మీ మేర ట్రాక్టర్ పరేడ్ కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీకి పోలీసులు ఇప్పటికే అనుమతి ఇవ్వగా.. ట్రాక్టర్ పరేడ్ సమయంలో పోలీసు భద్రత కూడా కల్పించనున్నారు. అయితే, ప్రతి ట్రాక్టరుపై జెండాను ఏర్పాటు చేసుకోవడంతోపాటు, జాతీయ గీతాలతో రైతులు ర్యాలీలో పాల్గొననున్నారు. ప్రతి ట్రాక్టరుపై గరిష్ఠంగా కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. ర్యాలీ ముగిసిన తర్వాత వీరంతా దీక్షా స్థలాలకు చేరుకోనున్నారు. ట్రాక్టర్ పరేడ్లో సమన్వయం కోసం ప్రైవేటు భద్రతా సంస్థను రైతు సంఘాలు నియమించుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల అనంతరం దాదాపు 11గంటలకు రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభంకానుంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశరాజధాని సమీపంలో రైతన్నలు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ను శాంతియుతంగా చేపట్టాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తద్వారా వ్యవసాయ చట్టాలపై తమకున్న అసంతృప్తిని యావత్ దేశానికి మరోసారి చాటిచెప్పాలని, దేశ ప్రజల మనసులను గెలుసుకోవడమే లక్ష్యంగా పరేడ్ నిర్వహిస్తామని కిసాన్ ఎక్తా మోర్చా అభిప్రాయపడింది.
ఇవీ చదవండి..
2లక్షల ట్రాక్టర్లతో రైతు కవాతు
దండు కదులుతోంది..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్.. విదేశాలకు పారిపోయాడనే వార్తల నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించాడు. -
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
హసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. -
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
‘వందే మెట్రో’ (Vande Metro) పేరుతో సమీప నగరాల మధ్య సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్