ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
అస్సాం ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన
అమింగావ్: తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. సోమవారం నాగర్బెరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువత.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేసే వారి చేతికి బడ్డీ బ్యాండ్ను కట్టి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 200 మంది తొలి సారి ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సాధారణంగా తమ రక్షణకు హామీ ఇవ్వాలని కోరుతూ సోదరులకు చెల్లెళ్లు రాఖీ కడతారు. అదే విధంగా మేము మొదటిసారి ఓటు వేసే వారికి తోడుగా ఉంటామని, ఓటు వేయాలని చెబుతూ సీనియర్లు కట్టేదే ఈ బడ్డీ బ్యాండ్’ అని కీర్తి వెల్లడించారు. ‘ఏడో తేదీన ఓటు వేయండి’ అని ఈ బ్యాండ్లపై రాసి ఉంది. మే 7న ఈ జిల్లాలో పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో? ఎందుకంత స్పెషల్? -
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
స్విగ్గీ (Swiggy)కి చెందిన ఒక డెలివరీ బాయ్ వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతోంది. దానిపై డెలివరీ యాప్ కూడా స్పందించింది. -
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన సొంత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
BJP: భాజపా ఎంపీ జయంత్ సిన్హా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ