Anju Sehwag: ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ సోదరి
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాన్ సోదరి అంజు సెహ్వాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆప్ సీనియర్ నేతల సమక్షంలో ఆమె పార్టీ
దిల్లీ: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆప్ సీనియర్ నేతల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. తన కుటుంబంలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తొలి వ్యక్తిని తానే అని అన్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ అక్క అయిన అంజు వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. దిల్లీలోని లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేశారు. సామాజిక కార్యకర్త కూడా. 2012లో దిల్లీలోని దక్షిణపురి ఎక్స్టెన్షన్ వార్డు నుంచి కౌన్సిలర్ పదవికి పోటీ చేసి గెలుపొందారు. మరికొద్ది నెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అంజు సెహ్వాగ్ ఆప్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో వీరేంద్రను దిల్లీ నుంచి పోటీ చేయాలని భాజపా కోరింది. అయితే తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పి.. ఆ ఆఫర్ను సెహ్వాగ్ సున్నితంగా తిరస్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.