భారత్‌ను ప్రశ్నించే హక్కు వారికి లేదు

సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం భారత్ ప్రధాన లక్ష్యం అని, ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌ అన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో...

Published : 16 Jan 2020 05:00 IST

దిల్లీ: సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం భారత్ ప్రధాన లక్ష్యం అని, ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌ అన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని పలు దేశాలు ఆహ్వానించడంపై ఆయన స్పందించారు. వాణిజ్యపరంగా వ్యవహరించడం భారత్ మార్గం కాదని తెలిపారు. దిల్లీలో రైసీనా చర్చా వేదిక (రైసీనా డైలాగ్) అనే సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో భారత్ ఎప్పటికీ వెనకంజ వేయదని తెలిపారు.

చైనాతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానిస్తూ ‘‘కీలకమైన విషయాలపై పొరుగున ఉన్న దేశాలతో ఒక అవగాహన రావడం ఎంతో ముఖ్యం. పరస్పరం సహకరించుకునే విధంగా భారత్-చైనాలు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య బంధం ప్రత్యేకమైనది’’ అని తెలిపారు. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ, రెండు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని