కరోనా ఎఫెక్ట్: భారత్ 24X7 హెల్ప్లైన్
దిల్లీ: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. చైనా నుంచి భారత్కు వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా వైరస్ అనుమానంతో హాస్పిటల్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ లక్షణాల గురించి త
దిల్లీ: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అన్ని దేశాలకూ విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. చైనా నుంచి భారత్కు వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా వైరస్ అనుమానంతో హాస్పిటల్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ లక్షణాల గురించి తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం 24X7 హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ వైరస్కు సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా 011-23978046 నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. చెకప్ కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రి వివరాలను కూడా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
కరోనా వైరస్కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 24X7 హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. జనవరి 1, 2020 నుంచి చైనా వెళ్లి వచ్చిన ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వాళ్లు స్వచ్ఛందంగా తమ వివరాలను ఈ హెల్ప్లైన్ కాల్సెంటర్కు ఫోన్ చేసి తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. కరోనా వైరస్ కొన్ని కేసుల్లో వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. భారత్లో కరోనా వైరస్ కేసులేవీ నమోదు కాలేదని భయపడాల్సిన పనేమి లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్లైన్ నెంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
చైనాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 106 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇది అమెరికా, జర్మనీ, శ్రీలంక, కెనడా సహా చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోను కరోనా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు. వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. హైదరాబాద్, పట్నాలోను కరోనా వైరస్ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం