అష్రాఫ్ ఘనీని అభినందించిన ట్రంప్
అఫ్గానిస్థాన్లో శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీసుకున్న చర్యల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం..........
ఓ ప్రకటనలో వెల్లడించిన శ్వేతసౌధం
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్లో శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీసుకున్న చర్యల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఘనీ తీసుకున్న చర్యల్ని ట్రంప్ కొనియాడారని వెల్లడించింది. ఈ మేరకు ఆయన ఘనీతో ఫోన్లో మాట్లాడారని పేర్కొంది. శాంతి స్థాపన కోసం ఇరు దేశాధినేతలు మున్ముందు మరింత కలిసి పనిచేసేందుకు అంగీకరించారని తెలిపింది. ఒప్పందం తదుపరి పరిణామాల్లో భాగంగా అఫ్గాన్ ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. తద్వారా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికి, దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉంటుంది.
మరోవైపు తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం షరతులతో కూడినదే అని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ స్పష్టం చేశారు. ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి ఇది ముందడుగు అని వ్యాఖ్యానించారు. అమెరికా సైనికుల త్యాగాల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. దోహాలో శనివారం తాలిబన్, అమెరికా మధ్య శాంతిఒప్పదం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. తాలిబన్ అన్ని షరతులకు కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు అఫ్గాన్ నుంచి వైదొలుగుతాయి. ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో అక్కడున్న మొత్తం 14 వేల మంది సైనికుల్లో 8600 మందిని అమెరికా వెనక్కి తీసుకుంటుంది. అదే నిష్పత్తిలో అమెరికా మిత్ర పక్షాలు కూడా తమ బలగాలను నాలుగు నెలల్లోగా ఉపసంహరించుకుంటాయి. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని అమెరికా, తాలిబన్లు పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. దాదాపు 5వేల మంది తాలిబన్ ఖైదీలు, అఫ్గాన్ సైన్యానికి చెందిన వెయ్యి మంది మార్చి 10 నాటికి విడుదల కావాల్సి ఉంది. అప్పటికల్లా అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్కు మధ్య చర్చలు మొదలవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.