వలసల నిషేధం 60 రోజులే: ట్రంప్
అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు వలసల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎంత కాలం వరకు అమలు చేయనున్నారో స్పష్టతనిచ్చారు......
వాషింగ్టన్: అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎంత కాలం వరకు అమలు చేయనున్నారో కూడా స్పష్టతనిచ్చారు. 60 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఇది ముఖ్యంగా శాశ్వత నివాస హోదా(గ్రీన్ కార్డు) కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అమల్లోకి తెస్తున్నట్లు అర్థమవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ‘‘ అమెరికాలోని నిరుద్యోగ పౌరులకు ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతోనే వలసల్ని నిలిపివేయాలని నిర్ణయించాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇక్కడి వారికి ఉండాలన్నది మా లక్ష్యం. వైరస్ విజృంభణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి స్థానంలో వలస వచ్చిన వారిని చేర్చుకోవడం వల్ల ఇక్కడి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అమెరికా పౌరుల సంక్షేమమే మా తొలి ప్రాధాన్యం. ఈ నిషేధం 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రంప్ వివరించారు.
ఈ నిషేధం నుంచి ట్రంప్ కొందరికి మినహాయింపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైరస్పై పోరులో ముందున్న వైద్య సిబ్బంది, ఆహార సరఫరా విభాగంలో పనిచేస్తున్న విదేశీయులను నిషేధం నుంచి తొలగించొచ్చని ఆయన పాలకవర్గంలోని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే వలసేతర వీసా అయిన హెచ్-1బీ పైనా స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేయొచ్చని తెలిపారు.
ట్రంప్ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వలస విధానాలను కఠినతరం చేయాలని ఆయన చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ విజృంభణతో తలెత్తిన పరిస్థితులను ట్రంప్ తన సొంత ఎజెండా అమలుకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కరోనాను నియంత్రించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని..ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారని అక్కడి వారు విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.