బెంగాల్ ఆస్పత్రుల్లో మొబైల్స్ నిషేధం
ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. అవి కరోనా వైరస్ను మోసుకొచ్చే ప్రమాదం ఉండటమే కారణమని వెల్లడించింది. కాగా ఐసోలేషన్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతోనే మమత సర్కారు ఇలా చేసిందని భాజపా విమర్శించింది. ఆ వీడియోలో రెండు మృతదేహాలు ...
రోగుల మధ్య మృతదేహాల వైరల్ వీడియో కారణం!
కోల్కతా: ఆస్పత్రుల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. అవి కరోనా వైరస్ను మోసుకొచ్చే ప్రమాదం ఉండటమే కారణమని వెల్లడించింది. కాగా ఐసోలేషన్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతోనే మమత సర్కారు ఇలా చేసిందని భాజపా విమర్శించింది. ఆ వీడియోలో రెండు మృతదేహాలు బాధితుల మధ్యనే ఉండటం గగుర్పాటు కలిగిస్తోంది.
ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు మొబైల్ ఫోన్లు వాడటం నిషేధిస్తున్నామని బెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా ఈ రోజు ప్రకటించారు. ఐసోలేషన్ వార్డుల్లో రోగులు మాట్లాడేందుకు ల్యాండ్లైన్లు, ఇంటర్కామ్ పెట్టిస్తామని వెల్లడించారు. అయితే అందరూ స్పర్శించే వీటిద్వారా కరోనా వైరస్ సోకదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అయిన వీడియో కోల్కతాలోని ఎంఆర్ బంగుర్ నోడల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు సంబంధించిందని సమాచారం. ఈ వీడియోలో రెండు మృతదేహాలను అలాగే మంచాలపై ఉంచారు. ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి తరలించలేదు. మిగతా రోగులు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వీడియో వాస్తవమా? నకిలీదా స్పష్టం చేయాలని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని డిమాండ్ చేశారు.
‘ఈ వీడియో అన్ని ఆన్లైన్ వేదికల్లో వైరల్ అయినప్పటికీ బెంగాల్ ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. అసలీ వీడియో నిజమో అబద్ధమో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ, అధికారులు వివరణ ఇవ్వలేదు. అంటే ఈ వీడియో నిజమనే నమ్మాల్సి వస్తోంది’ అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.