భౌతిక దూరం.. వినూత్న ఐడియాలు!
ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్డౌన్ నుంచి కొద్దికొద్దిగా బయటకు వస్తున్న తరుణంలో కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరమే నివారణ మంత్రం కానుంది.
బెర్లిన్: ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరమే నివారణ మంత్రం కానుంది. టీకాలు, ఔషధాలు లేని ఈ కష్టకాలంలో దాన్ని పాటించడమే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఆ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తులు, దేశాలు ఇప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నాయి. ఆ ఆలోచనలు కొన్ని నవ్వు తెప్పిస్తుండగా, మరి కొన్ని వావ్ అనిపిస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.
తల మీద నూడుల్స్: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నుంచి జర్మనీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దాంతో తాము, తమ వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి అక్కడి ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. అత్యంత తేలికగా ఉండే స్విమ్మింగ్ పూల్ నూడుల్స్తో క్యాప్ను తయారు చేసి వచ్చిన కస్టమర్లకు అందిస్తోంది. ఆ నూడుల్స్ పొడవుగా ఉండటంతో ఆటోమెటిగ్గా ఎవరైనా సరే దూరం దూరంగా కూర్చోవాల్సిందే. ఆ కేఫ్ తన ఆలోచనను ఫేస్బుక్లో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు కేఫ్ యజమానులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
చైనాలో హెడ్ గేర్: కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో దాని ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దాంతో అక్కడక్కడా పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. అక్కడి ఓ నగరంలోని పాఠశాలలో విద్యార్థులు హెడ్ గేర్లు ధరించి ఉన్న చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఆలోచనకు మూలం చైనీయులను పాలించిన సాంగ్ వంశంలోనే ఉంది. కోర్టు గదుల్లో అధికారులు ఒకరికొకరు చెవులు కొరుక్కోకుండా ఈ హెడ్ గేర్ల లాంటివే ధరించేవారట.
సరుకులకు తనకు బదులుగా రోబో: తమిళనాడులో ఓ వ్యక్తి తనకు బదులుగా సరుకులు తెచ్చుకోవడానికి ఓ రోబోను వరసలో నిలబెట్టాడు. ఇంజనీరింగ్ చదివిన ఆ వ్యక్తి రూ.3,000 ఖర్చు పెట్టి నాలుగు చక్రాల రోబోను రూపొందించాడు. ఆ చక్రాల మీద ఓ అట్టపెట్టను పెట్టి సరుకులకు పంపాడు.
సింగపూర్లో రోబో శునకం: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ సామాజిక దూరం పాటించేలా చూసేందుకు సింగపూర్ అధికారులు రోబో శునకాన్ని కాపలా పెట్టారు. అక్కడి సెంట్రల్ పార్కులో జాగింగ్కి వచ్చేవారు, సైక్లింగ్ చేసేవారు తగినదూరం పాటించేలా ఈ శునకానికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కనీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రజలు ఈ వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..