ట్రంప్‌ ప్రతిపాదనను తోసిపుచ్చిన మెర్కెల్‌

అమెరికాలో జరగబోయే జీ-7 దేశాల సదస్సుకు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ వ్యక్తగతంగా హాజరుకాబోరని ఆమె కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడితే ఈ.........

Published : 30 May 2020 15:40 IST

బెర్లిన్‌: అమెరికాలో జరగబోయే జీ-7 దేశాల సదస్సుకు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ హాజరుకాబోరని ఆమె కార్యాలయం ప్రకటించింది. ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడితే ఈ నిర్ణయంపై పునరాలోచిస్తామని తెలిపింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆమె హాజరయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ సదస్సు జూన్‌ 10-12 మధ్య జరగాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఇటీవల ఓ సందర్భంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. జీ-7 దేశాల సదస్సు ఆయా దేశాధినేతల వ్యక్తిగత హాజరు నడుమ జరపాలనుకుంటున్నానని తెలిపారు. ఇంతకంటే పెద్ద పునఃప్రారంభం ఏముంటుందని వ్యాఖ్యానించారు. తద్వారా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన మెర్కెల్‌ తాజాగా ఆమె నిర్ణయాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని