మరో డోక్లాంకు చైనా సన్నాహాలు
ఇళ్ల సరిహద్దు తగాదాలు సాధారణంగా గోడల వరకే పరిమితం అవుతాయి. దేశాలైనా అంతే.. సరిహద్దులు ఉన్నంత వరకే ఉంటాయి. అంతేగానీ పక్కింటివాళ్లు వచ్చి ‘‘మీ వంటిల్లూ మాదే’’.....
భూటాన్తో గిల్లికజ్జాలు
భారత్పై ఒత్తిడి పెంచే వ్యూహం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: ఇళ్ల సరిహద్దు తగాదాలు సాధారణంగా గోడల వరకే పరిమితం అవుతాయి. దేశాలైనా అంతే.. సరిహద్దులు ఉన్నంత వరకే ఉంటాయి. అంతేగానీ పక్కింటివాళ్లు వచ్చి ‘‘మీ వంటిల్లూ మాదే’’ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు భూటాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. చైనా ఏకంగా తనకు ఏమాత్రం సరిహద్దులేని భూటాన్లోని ఓ భూభాగాన్నీ తమదనే చెబుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రకటనతో కొంచెం ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత చైనా తత్వం తెలుసుకొని దీని తీరు ఇంతేలే అనుకొన్నాయి. భారత్పై అక్కసుతోనే ఇలా చేస్తోందని అర్థం చేసుకున్నాయి.
భూటాన్-భారత్ మధ్య ప్రత్యేకమైన బంధం. భూటాన్ రక్షణకు భారత్ హామీ ఇస్తోంది. భూటాన్పై దాడిని భారత్పై దాడిగా పరిగణిస్తామని గతంలో పార్లమెంట్లో నాటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్ని మార్పులు జరిగినా ఆ బంధం అలానే కొనసాగుతూ వస్తోంది. 2017లో డోక్లాం వద్ద భూటాన్ కోసమే భారత్ చైనాకు ఎదురొడ్డి నిలిచింది. తాజాగా మళ్లీ డోక్లాం వంటి సమస్యను సృష్టించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది.
అసలేం జరిగింది..?
చైనా విదేశాంగ శాఖ నిన్న అధికారికంగా ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. భూటాన్ తూర్పు భాగంలో కూడా తమకు సరిహద్దు వివాదం ఉందని పేర్కొంది. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోలేదని భారత్కు చెందిన ఓ ఆంగ్ల పత్రికకు ప్రకటన జారీ చేసింది. పైగా ఈ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకోకూడదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు భారత్ను ఉద్దేశించి చేసినవే అని చెప్పకనే చెబుతోంది. వీటిపై భారత విదేశంగా స్పందించలేదు.
అసలు సరిహద్దే లేదు..
ఇటీవల జరిగిన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్) సదస్సుల్లో భూటాన్లో సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాజెక్టు అభివృద్ధికి జీఈఎఫ్ నిధుల ఇవ్వడంపై చైనా అభ్యంతరం చెప్పింది. అది తమ మధ్య వివాదాస్పద భూభాగంగా పేర్కొంది. వాస్తవానికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చైనాతో సరిహద్దులు లేవు. భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్తో హద్దులు ఉన్నాయి. దీంతో జీఈఎఫ్ చైనా అభ్యంతరాన్ని నమోదు చేసుకొంది. అంతేగానీ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ఆపలేదు.
ఈ ప్రకటనలో నిజమెంత..?
వాస్తవానికి ఇరు దేశాల మధ్య పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1984 నుంచి 2016 వరకు వీటిపై 24 దఫాలు చర్చలు జరిగాయి. కానీ, ఎక్కడా తూర్పు భాగంలో విభేదాలు ఉన్నట్లు పేర్కొనలేదు. ఈ మీటింగ్ వివరాలు ఉన్న ప్రతుల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. తూర్పు భాగం పూర్తిగా మరో కొత్త వివాదం అని భూటాన్ చెబుతోంది.
మోదీ మాటలపై స్పందనా..?
ఇటీవల ప్రధాని మోదీ హఠాత్తుగా లద్దాఖ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో విస్తరణ వాదానికి కాలం చెల్లిందని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా చైనా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో భారత్ను కవ్వించేందుకే ఇలాంటి ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే చైనాకు సరిహద్దు వివాదం ఉన్న దేశాలు కేవలం భూటాన్, భారత్ మాత్రమే అని డ్రాగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భూటాన్ సాక్టెంగ్ భూభాగం తమదే అని చెప్పడం అంటే.. భారత్లో అరుణాచల్ ప్రదేశ్ మాదే.. అక్కడి నుంచి భూటాన్తో సరిహద్దు వివాదం ఉందని చెప్పుకోవడం అన్నమాట. అంటే భారత్తో మరోవైపు వివాదానికి చైనా సిద్ధమవుతోందనే సంకేతాలు వచ్చినట్లే!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం