Space: బ్రిటన్ కుబేరుడి రోదసి యాత్ర రేపే
రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్ కుబేరుడు
తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా ఈ ఘనత సాధించనున్న రిచర్డ్ బ్రాన్సన్
న్యూయార్క్: రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ చరిత్ర సృష్టించనున్నారు! ఆదివారం నాడు ఆయన న్యూ మెక్సికోలోని ప్రైవేటు స్పేస్పోర్టు నుంచి తన ‘వర్జిన్ గలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ’ అంతరిక్ష నౌక ద్వారా నింగిలో విహరిస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వర్జిన్ గ్రూప్ విమానం ‘వీఎంఎస్ ఈవ్’... తన 140 అడుగుల రెక్కల తోడుతో యూనిటీని నింగిలోకి తీసుకెళ్తుంది. 9 మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత అది ఈవ్ నుంచి విడిపోయి, అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. భూమి నుంచి 50 మైళ్ల దూరం వెళ్లాక అంతరిక్షంలో ప్రవేశించినట్టు భావిస్తారు. అయితే ఈ స్పేస్క్రాఫ్ట్ యూనిటీ 55 మైళ్లు దాటి ప్రయాణిస్తుందని, అనంతరం మళ్లీ నేరుగా స్పేస్పోర్టుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుమారు 90 నిమిషాలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నాయి. యూనిటీలో రిచర్డ్తో పాటు ఇద్దరు పైలట్లు, వర్జిన్ గలాక్టిక్కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ నౌక ద్వారా వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లాలని వర్జిన్ గలాక్టిక్ భావిస్తోంది.
వినియోగదారుల అనుభూతిని మదింపు చేస్తా: రిచర్డ్
‘‘ఈ జులైలో మా కల నెరవేరబోతోంది. యూనిటీలో ఒక వినియోగదారుడు ఎలా అనుభూతి చెందుతాడన్నది నేను స్వయంగా మదింపు చేస్తాను. నాకు తోడుగా విశేష ప్రతిభావంతులైన సిబ్బంది ఉండటం వర్జిన్ గలాక్టిక్ వ్యవస్థాపకుడిగా నాకెంతో గర్వకారణం’’ అని రిచర్డ్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నారు.
తోడు వెళ్లనున్న బండ్ల శిరీష
రిచర్డ్తో పాటు వీఎస్ఎస్ యూనిటీలో ప్రయాణించే వారిలో గుంటూరుకు చెందిన బండ్ల శిరీష (33) కూడా ఉండటం విశేషం! అమెరికాలోని జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేసిన శిరీష... 2015లో వర్జిన్ గలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.