EPF:కొవిడ్ కాలంలో ఊరట.. పీఎఫ్
కరోనా సమయంలో వేతన జీవులు ఉద్యోగుల భవిష్యనిధి నుంచి భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించారు.
1.7 లక్షల కోట్ల రూపాయల ఉపసంహరణ
ఏడాదిన్నరలో కరోనా క్లెయిమ్లు 1.21 కోట్లు
65 వేల కుటుంబాలకు ఈడీఎల్ఐ పరిహారం
ఈనాడు, హైదరాబాద్: కరోనా సమయంలో వేతన జీవులు ఉద్యోగుల భవిష్యనిధి నుంచి భారీ మొత్తంలో నిధులు ఉపసంహరించారు. కరోనా తొలిదశ మొదలైనప్పటి నుంచి రెండోదశ ముగిసే వరకు దాదాపు రూ.1.7 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. నగదు ఉపసంహరణ కింద 4.63 కోట్ల క్లెయిమ్లు వచ్చాయి. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో వేతన జీవులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైరస్ సోకడంతో వైద్య ఖర్చుల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కేందుకు ఈపీఎఫ్ నిధుల్ని ఎక్కువగా వినియోగించుకున్నారు. కరోనా సమయంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి మూణ్నెల్ల వేతనం (బేసిక్+డీఏ) లేదా 90 శాతం నిల్వలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించింది. తొలివిడత కరోనా సమయంలో ఒకసారికి అనుమతి ఇచ్చినా, రెండో విడత సమయంలో రెండుసార్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. కరోనా కేటగిరీలో ఈపీఎఫ్వోకు 1.21 కోట్ల క్లెయిమ్లు అందినట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది. ఇప్పటివరకు రూ.28,288 కోట్ల సొమ్మును కార్మికులు వెనక్కి తీసుకున్నారు. ఒక్కో క్లెయిమ్ కింద సగటున రూ.23,378 లభించాయి. సాధారణ, వైద్య క్లెయిమ్ల కింద 3.42 కోట్లు అందగా, వీటిని పరిష్కరించి రూ.1.42 లక్షల కోట్లు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
భారీగా ఈడీఎల్ఐ క్లెయిమ్లు
కరోనా కోరల్లో చిక్కిన వేతన జీవుల్లో కొందరు చికిత్సకు కోలుకోగా.. మరికొందరు చనిపోయారు. ఈపీఎఫ్వో చందాదారులకు ఉద్యోగి డిపాజిట్ ఆధారిత జీవిత బీమా(ఈడీఎల్ఐ) సౌకర్యం ఉంది. ఈ బీమా కింద ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కనీసం రూ.2.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షలు భవిష్యనిధి సంస్థ ఇస్తోంది. కొవిడ్ సమయంలో ఈడీఎల్ఐ బీమా కింద 65 వేల క్లెయిమ్లు ఈపీఎఫ్వో పరిష్కరించింది. కరోనా తొలిదశతో పోల్చితే రెండోదశ చివర నాటికి క్లెయిమ్ల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశ తరవాత జులై- సెప్టెంబరు కాలంలో 22 వేల క్లెయిమ్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..