Yogi Adityanath: విద్యార్థులకు యోగి మరో కానుక

ఉత్తర్‌ప్రదేశ్‌లో డిగ్రీ చదువుతున్న కోటి మంది విద్యార్థులకు

Published : 28 Dec 2021 10:54 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో డిగ్రీ చదువుతున్న కోటి మంది విద్యార్థులకు ట్యాబ్, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం ప్రకటించింది. ఇంటర్మీడియెట్, మెట్రిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు, ట్యాబ్‌లు అందించనుంది. రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి రూ.లక్ష వంతున, జిల్లా స్థాయి ప్రతిభావంతులకు రూ.21,000 వంతున ఇవ్వనుంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని