Supreme Court: అవినీతిపై దర్యాప్తు నిలిపివేతకు సుప్రీం నిరాకరణ
తనపై నమోదైన అవినీతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని
అరెస్టు నుంచి ఛత్తీస్గఢ్ ఐపీఎస్ అధికారికి లభించని ఉపశమనం
దిల్లీ: తనపై నమోదైన అవినీతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ సస్పెన్షన్లో ఉన్న ఛత్తీస్గఢ్ ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ ప్రతీకార చర్యలకు తాను బాధితుడిగా మారానని ఆ అధికారి పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన అవినీతి నిరోధక (ఆర్థిక నేరాల) విభాగం చేస్తున్న దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ గుర్జీందర్ పాల్ చేసుకున్న అభ్యర్థనను నవంబరు 26న ఛత్తీస్గఢ్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఛత్తీస్గఢ్లో జరిగిందని చెబుతున్న పౌర సరఫరాల కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యపై చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక విభాగం అధిపతిగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పదే పదే తనపై ఒత్తిడి తెచ్చిందని గుర్జీందర్ పాల్ పిటిషన్లో తెలిపారు. సరైన ఆధారాలు లేనందున తాను చర్యలు తీసుకోలేనని తెలపడంతో ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని పేర్కొన్నారు. 1994 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉన్న సమయంలో రాయ్పుర్, దుర్గ్, బిలాస్పుర్ ఐజీగా పనిచేశారు. ఛత్తీస్గఢ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న ఆయనను ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుర్జీందర్ పాల్పై అవినీతి, దేశద్రోహం, దోపిడీ కేసులు నమోదు చేయగా గత ఏడాది అక్టోబరు 1న అవినీతి మినహా రెండు కేసుల్లో కఠిన చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. పోలీస్ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కవుతున్నారని ఆక్షేపించింది. గుర్జీందర్ పాల్ పిటిషన్పై 8వారాల్లో నిర్ణయం వెలువరించాలని ఛత్తీస్గఢ్ హైకోర్టుకు సూచించింది. ఆదాయానికి మించి ఆస్తులున్న అవినీతి కేసులో ఆ అధికారికి అనుకూలమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు కూడా తిరస్కరించింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో ఓబీసీ రిజర్వేషన్లపై 17న సుప్రీంకోర్టు విచారణ
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ఈ నెల 17న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము గత ఏడాది డిసెంబరు 17న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన దరఖాస్తు అదే రోజు విచారణకు వస్తుందని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో స్థానిక సంస్థల్లో ఓబీసీలకు కేటాయించిన సీట్లను జనరల్ కేటగిరీలో రీనోటిఫై చేయాలని ఆ రాష్ట్రాల ఎన్నికల కమిషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి గమనార్హం.
సువేందు అధికారిపై పిటిషన్ కొట్టివేత
పశ్చిమబెంగాల్కు చెందిన భాజపా ఎమ్మెల్యే సువేందు అధికారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరపకుండా స్టే విధిస్తూ కలకత్తా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుపై అప్పీలును అక్కడి ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చడం మీద పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిని దాఖలు చేసింది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వును ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారని, దానిపై గత నెల 13నే తీర్పు సయితం వెలువడిందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సుప్రీంకోర్టులో వాదనలన్నీ అయ్యాక కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట మళ్లీ అప్పీలు చేసే ప్రశ్న ఎక్కడుందని బెంగాల్ సర్కారు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అదే అంశం మీద పదేపదే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. సువేందు అధికారి అంగరక్షకుడు హత్యకు గురికావడంపై సీఐడీ జారీచేసిన సమన్లపై కలకత్తా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నాలుగు నెలల క్రితం తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఆయనపై ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే