Budget 2023: ఆరోగ్యానికి స్వస్థ్య.. ఆవిష్కరణలతో చికిత్స!
కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్లో స్వల్పంగా నిధులను పెంచింది. ఆ రంగానికి రూ.89,155 కోట్లను ప్రతిపాదించింది.
వైద్య రంగానికి రూ.89,155 కోట్లు
157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్లో స్వల్పంగా నిధులను పెంచింది. ఆ రంగానికి రూ.89,155 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్లో కేటాయించిన దాని (రూ.79,145 కోట్లు) కంటే ఇది 13 శాతం అదనం. ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,647.50 (గత బడ్జెట్ కంటే 20 శాతం అదనం) కోట్లు కేటాయించింది. ప్రతిపాదించిన మొత్తంలో రూ.86,175 కోట్లను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు, రూ.2,980 కోట్లను వైద్య పరిశోధనల విభాగానికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తన ప్రసంగంలో వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నెలకొల్పిన 157 వైద్య కళాశాలలకు అనుబంధంగా 157 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజా బడ్జెట్లో నిర్ణయించింది.
2047 నాటికి సికిల్సెల్ ఎనీమియా నిర్మూలన!
దేశవ్యాప్తంగా 2047 నాటికి సికిల్సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక మిషన్ను ప్రారంభించనున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ వ్యాధి ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లోని 40 ఏళ్ల వయసులోపు 7 కోట్ల మంది గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, వ్యాధిపై అవగాహన కల్పిస్తామని వివరించారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై)ను రెండుగా విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాన్ని పీఎంఎస్ఎస్వైతోపాటు కొత్తగా నెలకొల్పనున్న ఎయిమ్స్ స్థాపన వ్యయాన్ని ప్రత్యేకంగా పేర్కొననున్నట్లు తెలిపింది. ఈ బడ్జెట్లో పీఎంఎస్ఎస్వైకు రూ.3,365 కోట్లు, 22 కొత్త ఎయిమ్స్ల స్థాపనకు రూ.6,835 కోట్లుగా కేటాయించింది. గతేడాది పీఎంఎస్ఎస్వైకు రూ.10 వేల కోట్లు ప్రతిపాదించింది.
పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతం
పరిశోధనలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ఎంపిక చేసిన ఐసీఎంఆర్ ల్యాబ్లలో పరిశోధన చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బోధనా సిబ్బందికి అనుమతి ఇస్తుంది. అందుకు అవసరమైన సదుపాయాలూ కల్పిస్తుంది. వైద్య సంస్థల్లో భవిష్యత్ మెడికల్ టెక్నాలజీ, ఉత్తమ ఉత్పత్తులు, పరిశోధనలకు అవసరమైన నిపుణుల కోసం వైద్య పరికరాల(మెడికల్ డివైస్)ను ఉపయోగించడంలో మెలకువలు తెలిపేందుకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనుంది. ఫార్మా రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారా ప్రమోట్ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వివరించారు. వైద్య రంగానికి సంబంధించిన పరిశోధన, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం