మా తరం.. సేవా స్వరం.. కేరళలోని అలప్పుళ జిల్లాలో వినూత్న కార్యక్రమం
పేద కుటుంబాలకు చేయూత అందించేందుకు కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ వి.ఆర్.కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం దీని ప్రధాన లక్ష్యం.
పేదరిక నిర్మూలనకు విద్యార్థుల ముందడుగు
అలప్పుళ: పేద కుటుంబాలకు చేయూత అందించేందుకు కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ వి.ఆర్.కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం దీని ప్రధాన లక్ష్యం.
కేరళ తీర ప్రాంతాల్లోని కుటుంబాల్లో పేదరికాన్ని దూరం చేసేందుకు ‘అలెప్పి పిల్లలు’ పేరున సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. పాఠశాలల్లో ప్రతి 100 మంది విద్యార్థుల బృందం ఒక్కో పేద కుటుంబాన్ని దత్తత తీసుకుని, ప్రతినెలా వారికి నిత్యావసరాలు ఇతర వస్తువులు అందజేయడం దీని ప్రధాన ఉద్దేశం. కొన్ని పాఠశాలల్లో 50 మంది పిల్లల బృందాలే ఈ బృహత్తర కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొంటున్నాయి. దీనికోసం ముందుగా జిల్లా యంత్రాంగం ఆర్థికంగా వెనుకబడిన 3,613 కుటుంబాలను గుర్తించింది. తరువాత వారిని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలకు అనుసంధానం చేశారు. వివాదాలకు ఆస్కారం లేకుండా కుటుంబాల ఎంపిక ప్రక్రియను గోప్యంగా ఉంచారు. ఇలా దేశంలోనే పేదలకు చేయూత అందించే మొదటి జిల్లాగా అలప్పుళ నిలిచింది.
నెలలో మొదటి సోమవారం
అలప్పుళ జిల్లాలోని పంచాయతీలు, శాసన సభ్యులు, మంత్రుల సహకారంతో ప్రతి నెలా మొదటి సోమవారం పాఠశాలల్లో ‘సమాజ సేవా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఆ రోజు విద్యార్థులు ఆహారోత్పత్తులు, ఇతర వస్తువులు తెచ్చి ఓ పెట్టెలో ఉంచేలా ప్రోత్సహిస్తున్నారు. వాటిలో ఖరీదైన వస్తువులు, బియ్యం కాకుండా పప్పు దినుసులు, సబ్బులు, పేస్టులు, గోధుమ పిండి ఇతరత్రా ఉంటాయి. పేదలకు పౌర పంపిణీ ద్వారా ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి.. కనుక వాటిని మాత్రం తీసుకురావొద్దని చెబుతున్నారు.
పిల్లలు, తల్లిదండ్రులే కీలకం..
‘అలెప్పి పిల్లలు’ పేరున పేదలకు అందుతున్న సేవల్లో పిల్లలు, తల్లిదండ్రులదే కీలక భూమికని కలెక్టర్ కృష్ణతేజ చెబుతున్నారు. అన్నిచోట్లా మంచి స్పందన వస్తోందంటున్నారు. ఆదర్శ భావాలు కలిగిన కేరళ ప్రజల వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పంచడం వల్ల కలిగే సంతృప్తిని చిన్నతనంలోనే పిల్లలు అనుభూతి చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం