సోరస్ పక్షపాతి, ప్రమాదకారి.. ఆయనవి మూర్ఖపు అభిప్రాయాలు: కేంద్రమంత్రి జైశంకర్
పారిశ్రామికవేత్త గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర సర్కారుపై ప్రధాని నరేంద్రమోదీ పట్టును బలహీనపరిచే అవకాశం ఉందంటూ ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు.
దిల్లీ, సిడ్నీ: పారిశ్రామికవేత్త గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర సర్కారుపై ప్రధాని నరేంద్రమోదీ పట్టును బలహీనపరిచే అవకాశం ఉందంటూ ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు. ఆయన్ని పక్షపాతిగా, ఒక దృక్కోణాన్ని ఆవిష్కరించి చూపేందుకు వనరుల్ని వినియోగించే వ్యక్తిగా అభివర్ణించారు. జర్మనీలోని మ్యూనిక్లో భద్రత సదస్సులో సోరస్ ప్రసంగిస్తూ.. మోదీ, అదానీల భవితవ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు చెప్పడాన్ని జైశంకర్ తప్పుపట్టారు. శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన చర్చల్లో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘సోరస్ ధనికుడు, వృద్ధుడు. ప్రమాదకారి. మూర్ఖమైన అభిప్రాయాలున్న వ్యక్తి. న్యూయార్క్లో కూర్చొని తన అభిప్రాయాల ప్రకారమే ప్రపంచమంతా నడుచుకోవాలని ఇప్పటికీ అనుకుంటారు. లక్షల మంది ముస్లింల పౌరసత్వంపై భారత్ వేటు వేయబోతోందని ఇదే సదస్సులో కొన్నేళ్ల క్రితం సోరస్ ఆరోపించారు. అలా లక్షలమందిని భయపెట్టే ప్రయత్నం చేయడం వల్ల సామాజిక కూర్పునకు భారీనష్టం వాటిల్లుతుంది’ అని చెప్పారు.
ఆస్ట్రేలియా ప్రధానితో భేటీ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్ శనివారం ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థికావకాశాలు, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు అంశాలపై చర్చించారు. ‘వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తిని మా భేటీ ప్రతిబింబించింది. ఈ భాగస్వామ్యంలోని తాజా పరిణామాలను వివరించాను. రెండు దేశాలూ ఇష్టపడే క్రికెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చేనెలలో తాను భారత్కు రాబోతున్నట్లు అల్బనీస్ తెలిపారు. మరో కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ భావసారూప్య దేశాలు కలిసి పనిచేయాలన్నారు.
మోదీ సర్కారు అంత దుర్బలమా?: చిదంబరం
విదేశానికి చెందిన ఒక పెట్టుబడిదారుడు చేసిన వ్యాఖ్యతో కుప్పకూలే దుర్బల స్థితిలో మోదీ సర్కారు ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. సోరస్ ఇప్పుడే కాకుండా గతంలోనూ మాట్లాడిన చాలా అంశాలతో తాను ఏకీభవించనని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యలను భాజపా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఎవరు అధికారంలో ఉండాలో బయటివారు కాకుండా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.