అభిషేక్‌ బెనర్జీ భార్యను విదేశాలకు వెళ్లనివ్వని అధికారులు!

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

Published : 06 Jun 2023 04:07 IST

కోల్‌కతా: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. రుజిరా తన ఇద్దరు పిల్లలతో కలిసి యూఏఈ వెళ్లడానికి సోమవారం ఉదయం సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆమెను నిలువరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఈడీ జారీ చేసిన లుకౌట్‌ నోటీసే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ నోటీసు ప్రకారం రుజిరా ఈ నెల 8న విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని