వంద అడుగుల బావిలో రోజంతా..

కేరళలో ఓ వ్యక్తి (55) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. బాధితుడు ఇంకా బావిలోనే ఉన్నాడు.

Updated : 10 Jul 2023 09:09 IST

కేరళలో ఓ వ్యక్తి (55) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. బాధితుడు ఇంకా బావిలోనే ఉన్నాడు. అతణ్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తిరువనంతపురంలోని ముక్కోల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రంతా సహాయకచర్యలు కొనసాగినా.. బాధితుణ్ని బయటకు తీయడం సాధ్యం కాలేదు. తమిళనాడుకు చెందిన మహరాజన్‌ బావిలోకి పైపులు దింపే పని చేస్తుంటాడు. ఇక్కడా ఆ పనిలోనే ఉండగా.. పైనుంచి మట్టిపెళ్లలు కూలిపడి ఇరుక్కుపోయాడు. బావి వంద అడుగుల లోతు ఉందని, అధునాతన పరికరాలను తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని