రక్తం అమ్ముకోవద్దు.. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి: డీసీజీఐ
అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో బ్లడ్బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దిల్లీ: అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో బ్లడ్బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తానికి వసూలుచేస్తున్న అన్నిరకాల ఫీజులను తొలగించాలని నిర్ణయించినట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వెల్లడించింది. రక్తం అమ్ముకోరాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు ఇకపై ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. ‘‘రక్తానికి అధికరుసుం వసూలు చేస్తున్న అంశంపై గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ 62వ సమావేశంలో అధికారులు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. ‘రక్తం అమ్మకానికి కాదు’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. దాన్ని సరఫరా మాత్రమే చేయాలని నిర్ణయించారు. బ్లడ్బ్యాంకులు ప్రాసెసింగ్ రుసుం ఒక్కటే వసూలుచేయాలని సిఫార్సు చేశారు’’ అని డీసీజీఐ తన లేఖలో పేర్కొంది. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ విభాగాలకు తెలియజేసినట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం రక్తం లేదా రక్త విభాగాలకు (ప్లాస్మా, తెల్లరక్తకణాల వంటివి) రూ.250 నుంచి రూ.1,550 వరకు మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులను డీసీజీఐ ఆదేశించింది. బాధితుల తరఫున రక్తదానం చేయని పక్షంలో కొన్ని ఆసుపత్రులు, బ్లడ్బ్యాంకులు ఒక్కో యూనిట్ సరఫరాకు రూ.3,000 నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. రక్తం కొరత, అరుదైన గ్రూపు అవసరమైన సమయంలో ఈ ధర మరింత ఎక్కువ ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలోనివిగా భావిస్తోన్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతీమాలీవాల్ స్పందించారు. -
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ