Oxygen Shortage Deaths: మరణాల సమాచారం అందించాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం
కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్ కొరతతో మృతిచెందినవారి సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు అందించిన ఆ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు....
దిల్లీ: కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్ కొరతతో మృతిచెందినవారి సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు అందించిన ఆ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు పార్లమెంట్కు అందించనున్నట్లు తెలుస్తోంది. కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులెవరూ ప్రాణాలు కోల్పోలేదని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. కాగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కొవిడ్ సెకండ్ వేవ్లో ప్రాణవాయువు కొరతతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలు సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ఈనెల 20న రాజ్యసభకు తెలిపింది. రెండో దశలో ప్రాణవాయువు లభించక రోడ్లపైనా, ఆసుపత్రుల్లోను కొవిడ్ బాధితులు భారీ సంఖ్యలో చనిపోయారా? లేదా? అన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. మరణాలు దాచిపెట్టాల్సిన అవసరమేమీ లేదని పేర్కొన్నారు.
కాగా ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే భాజపా సర్కారు ఇలాంటి అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టాయి. ఆక్సిజన్ కొరతే లేకపోతే ఆసుపత్రులు ఎందుకు కోర్టులకు వెళ్తాయని విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆక్సిజన్ లేక బాధితులు మరణించలేదని, దానిని అందజేయడంలో కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య ధోరణితోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం